బారువ
10:11 వద్ద ఏప్రిల్ 10, 2010 | ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో రాసారు | వ్యాఖ్యానించండిబారువ
బారువ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలమునకు చెందిన ఒక గ్రామము. ఈ గ్రామము “ఆలయాల” గ్రామమనే పేరుతో పేర్కొన్నది. ఇందుకు కారణము, ఈ గ్రామమున ఎటు చూసినా ఆలయాలే కనుబడును. బారువలోని ఆలయాలలో ప్రస్సిద్ధి చెందిన కొన్ని ఆలయాలు – శ్రీకోటిలింగేశ్వరస్వామివారి ఆలయము మరియు జనార్ధనస్వామివారి ఆలయము. అందమైన ప్రకృతి శోబలతో కూడిన ఈ ప్రదేశము, యాత్రికుల మనసులను మైమరచిన ప్రదేశముగా పేర్కొన్నది.
బారువ సముద్ర తీరము చాలా అందముగానూ, అహ్లాదకరముగాను వుండును. ఈ సముద్ర తీరమున, వేకువ జామున, ఉదయించు సూర్యుడిని దర్శించిన వారు, ఆ అందములో మైమరచిపోతారు. మహాభారతము మరియు స్కందపురాణము వంటి మొదలైన పౌరాణిక గ్రంధాలలో బారువ తీరమునకు ఓ ప్రత్యేకత వున్నది. ప్రతి 12 సంవత్సరాలకొకసారి, వచ్చు పుష్కరమహోదయమునకు ఈ స్ధలము ప్రసిద్ధి గాంచినది.
తూర్పు కనుమల నుంచి మొదలై, ఒరిస్సా మరియు ఆంధ్రా రాష్ట్రముల గుండా ప్రవహించి, బంగాళఖాతములో కలిసిపోవు మహేంద్రతనయ నదీ యొక్క సంగమస్ధలమే ఈ బారువ గ్రామము.
బారువ చరిత్ర
బారువ చరిత్ర స్కందపురాణము ఆధారముగా పలువురు సిద్ధాంతులుచే పేర్కొనబడినది. సుమారు 16 వేల సంవత్సరాల క్రితము, తూర్పు కనుమలలో సంచరించుచుండిరి. అప్పుడు ఒక అడవి జంతువును వేటాడబోయి, పాండవులు ఆ జంతువు కదిలే శబ్దము వైపు బాణము విడిచిరి. కానీ దురాదృశ్టవశాత్తుగా ఆ బాణము ఓ ఆవును తాకి, ఆ ఆవు మరణించినది. ఇది ఎరిగిన పాండవులు తాము చేసిన కుట్రకు బాధపడి, ఆవు హత్య మహాపాపమని, ఆ పాప విమోచనకై ఆలోచించగా, ఓ మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవు యొక్క శవమును తీసుకువెళ్లి, సముద్రతీరమునందు ఆ ఆవుకు కర్మకాండములు జరపవలెనని సలహా ఇచ్చెను.మునీశ్వరుని సలహా ప్రకారము ఆ గోవుకు అంత్యక్రియలు జరిపి, అనంతరము మహేంద్రతనయనదీ మరియు సముద్రపు సంగమ స్ధలములో స్నానమాడి, తాము చేసిన పాపమునకు విమోచనము పొంది, మోక్షము పొందారన్నది చరిత్ర.
బారువ సముద్రతీరము
వ్యాఖ్యానించండి »
వర్డ్ప్రెస్.కామ్లో ఓ ఉచిత వెబ్సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.
వ్యాఖ్యానించండి